వ్యక్తిగత పర్యటనలో.భాగంగా సతీమణి భువనేశ్వరి తో సీఎం చంద్రబాబు లండన్ పర్యటన
అమరావతి, 1 నవంబర్ (హి.స.):వ్యక్తిగత పర్యటనలో భాగంగా సతీమణి భువనేశ్వరితో కలిసి సీఎం చంద్రబాబు శనివారం రాత్రి హైదరాబాద్‌ నుంచి లండన్‌కు బయల్దేరి వెళ్లనున్నారు. ఎన్టీఆర్‌ ట్రస్టు మేనేజింగ్‌ ట్రస్టీ, హెరిటేజ్‌ ఫుడ్స్‌ ఎండీ భువనేశ్వరికి ఇన్‌స్టిట్యూట్‌
వ్యక్తిగత పర్యటనలో.భాగంగా సతీమణి భువనేశ్వరి తో సీఎం చంద్రబాబు లండన్ పర్యటన


అమరావతి, 1 నవంబర్ (హి.స.):వ్యక్తిగత పర్యటనలో భాగంగా సతీమణి భువనేశ్వరితో కలిసి సీఎం చంద్రబాబు శనివారం రాత్రి హైదరాబాద్‌ నుంచి లండన్‌కు బయల్దేరి వెళ్లనున్నారు. ఎన్టీఆర్‌ ట్రస్టు మేనేజింగ్‌ ట్రస్టీ, హెరిటేజ్‌ ఫుడ్స్‌ ఎండీ భువనేశ్వరికి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ (ఐవోడీ) సంస్థ నవంబరు 4న డిస్టింగ్విష్డ్‌ ఫెలోషిప్‌-2025 అవార్డు అందించనుంది. అలాగే, హెరిటేజ్‌ ఫుడ్స్‌కు ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ కార్పొరేట్‌ గవర్నెన్స్‌ విభాగంలో లభించిన గోల్డెన్‌ పీకాక్‌ అవార్డును కూడా అదే వేదికపై భువనేశ్వరి అందుకోనున్నారు. లండన్‌లోని గ్లోబల్‌ కన్వెన్షన్‌లో జరిగే ఈ కార్యక్రమానికి చంద్రబాబు హాజరవుతారు. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌ కలాం, హిందూజా గ్రూప్‌ కో చైర్మన్‌ గోపీచంద్‌, ఆదిత్య బిర్లా సెంటర్‌ ఫర్‌ కమ్యూనిటీ ఇనీషియేటివ్స్‌ చైర్‌పర్సన్‌ రాజశ్రీ బిర్లా, సన్‌ ఫార్మా ఎండీ దిలీప్‌ సంఘ్వీ, దుబాయ్‌ ఎలక్ట్రిసిటీ, వాటర్‌ అథారిటీ ఎండీ సయీద్‌ మహ్మద్‌, హీరో ఎంటర్‌ పైజ్రెస్‌, గోయెంకా గ్రూప్‌ సంస్థల చైర్మన్‌ సంజీవ్‌ గోయెంకా వంటి ప్రముఖులు గతంలో ఈ అవార్డును అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యాపార, సామాజిక, పరిపాలనా రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొంటారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande