
అమరావతి, 1 నవంబర్ (హి.స.)
కర్నూల్: వైసీపీ అధికార ప్రతినిధి ఆరె శ్యామలతో పాటు మరికొందరు వైసీపీ నాయకులకు బిగ్ షాక్ తగిలింది. కర్నూలు బస్సు ప్రమాదం ఘటనపై తప్పుడు ప్రచారం చేసినందుకు పోలీసులు వారికి నోటీసులు జారీ చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక పోలీసు బృందం, హైదరాబాద్లోని గండిపేటలో ఆరె. శ్యామల నివాసానికి వెళ్లి నోటీసులు అందజేసింది. నోటీసుల ప్రకారం, మూడు రోజుల్లో విచారణకు హాజరుకావాలని సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ