
తిరుమల, 12 నవంబర్ (హి.స.) తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం ఉదయానికి 22 కంపార్టుమెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. కంపార్టుమెంట్లలో ఉన్న భక్తులకు స్వామివారి దర్శనానికి 8 గంటల సమయం పడుతుందని టీటీడీ తెలిపింది. సర్వదర్శనం టోకెన్లు లేని భక్తులకు 15 గంటల సమయం పడుతుందని, రూ.300 శీఘ్రదర్శనానికి 3-4 గంటల సమయం పడుతుందని వెల్లడించింది.
మంగళవారం (నవంబర్ 11) స్వామివారిని 67,367 మంది భక్తులు దర్శించుకోగా.. 22,369 మంది భక్తులు తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారికి భక్తులు హుండీలో సమర్పించిన కానుకలు రూ.4.30 కోట్లు వచ్చినట్లు టీటీడీ తెలిపింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV