
ముంబై, 14 నవంబర్ (హి.స.)
బీహార్లో ఎన్డీఏ కూటమి భారీ విక్టరీ దిశగా దూసుకుపోతుంది. భారీ లాభాలతో దూసుకెళ్లాల్సిన సూచీలు.. ఆశ్చర్యంగా నష్టాల్లో ట్రేడ్ అవుతోంది. బీహార్ ఫలితాలు రుచించనట్లుగా కనిపిస్తోంది. ప్రస్తుతం సెన్సెక్స్, నిఫ్టీ కూడా నష్టాల్లో కొనసాగుతోంది.
ప్రస్తుతం సెన్సెక్స్ 141 పాయింట్లు నష్టపోయి 84, 337 దగ్గర కొనసాగుతుండగా.. నిఫ్టీ 31 పాయింట్లు నష్టపోయి 25, 847 దగ్గర కొనసాగుతోంది. నిఫ్టీలో ఓఎన్టీసీ, టెక్ మహీంద్రా, టాటా స్టీల్, మారుతి సుజు, టీసీఎస్ నష్టాల్లో కొనసాగుతున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..