నర్సంపేటలో సీఎం పర్యటన.. రూ.508 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
వరంగల్, 5 డిసెంబర్ (హి.స.) ప్రజా పాలన - ప్రజా విజయోత్సవాల్లో భాగంగా వరంగల్ జిల్లా నర్సంపేటలో పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. రూ.508 కోట్లతో చేపట్టిన పనులకు శంకుస్థాపన చేశారు. నర్సంపేట-నెక్కొండ 4 లేన్ల రోడ్డు నిర
సీఎం రేవంత్ రెడ్డి


వరంగల్, 5 డిసెంబర్ (హి.స.)

ప్రజా పాలన - ప్రజా విజయోత్సవాల్లో

భాగంగా వరంగల్ జిల్లా నర్సంపేటలో పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. రూ.508 కోట్లతో చేపట్టిన పనులకు శంకుస్థాపన చేశారు. నర్సంపేట-నెక్కొండ 4 లేన్ల రోడ్డు నిర్మాణం, హనుమకొండ-మహబూబాబాద్ నాలుగు లేన్ల రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. దాంతో పాటు నర్సంపేటలో నర్సింగ్ కాలేజీ నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేశారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande