
హైదరాబాద్, 6 డిసెంబర్ (హి.స.)
ఇండిగో తీరుపై కేంద్రం సీరియస్ అయింది. ప్రయాణికులపై అదనపు ఆర్థిక భారం పడకుండా చూడాలని ఇండిగోకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. టికెట్ల రద్దు రీఫండ్ ను ఆలస్యం చేయొద్దని రేపు రాత్రి 8 గంటల లోపు ప్రయాణికులకు మొత్తం చెల్లించాలని ఆదేశించింది. ప్రయాణికుల సహాయార్ధం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. కాగా ఇండిగో విమానాల రద్దుతో పలు రూట్లలో దాదాపు 10 రెట్లు విమాన చార్జీలు పెరిగాయి. ముఖ్యంగా ఢిల్లీ, ముంబయి, హైదరాబాద్, గోవా, పూణే, శ్రీనగర్ టికెట్లు భారీగా పెరిగాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు