
మెదక్, 6 డిసెంబర్ (హి.స.)
గ్రామ పంచాయతీ ఎన్నికల
నేపథ్యంలో మెదక్ ఆర్డీవో రమాదేవి నామినేషన్లు, గుర్తుల కేటాయింపు ప్రక్రియను శనివారం పరిశీలించారు. నిజాంపేట మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో కొనసాగుతున్న ఎన్నికల ప్రక్రియను వారు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆర్డిఓ రమాదేవి మాట్లాడుతూ.. రెండో విడత ఎన్నికలను నామినేషన్ ప్రక్రియలో భాగంగా అభ్యర్థులకు గుర్తు కేటాయింపు జరుగుతుందని తెలిపారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..