హైదరాబాద్, 9 జూన్ (హి.స.)
కొత్తగూడెం సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కు హైకోర్టులో భారీ ఊరట లభించింది. 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నిబంధనల మేరకు అఫిడవిట్ను దాఖలు చేయలేదంటూ కొత్తగూడెంకు చెందిన నందులాల్ అగర్వాల్ అనే వ్యక్తి కూనంనేనిపై అనర్హత వేటు వేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్పై వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తులు పిటిషన్ను క్వాష్ చేయడానికి నిరాకరించారు. అంశంపై సమగ్రంగా విచారణ జరగాలని తేల్చారు. దీంతో కూనంనేని హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఇవాళ ఆయన పిటిషన్పై మరోసారి విచారణ చేపట్టిన ధర్మాసనం సరైన ఆధారాలు లేవంటూ నందూలాల్ అగర్వాల్ పిటిషన్ను కొట్టివేస్తూ తుది తీర్పును వెలువరించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..