తెలంగాణ, సూర్యాపేట. 19 జూలై (హి.స.)
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా
ప్రభుత్వం పని చేస్తుందని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు. శనివారం శాలిగౌరారం మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో మండలంలోని 93 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాధీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళ సంక్షేమం, ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. అంతకుముందు మండల కేంద్రంలో వన మహోత్సవంలో భాగంగా మొక్కను నాటి నీళ్లు పోశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు