తిరుమల సమాచారం.. శ్రీవారి దర్శనానికి సమయం ఎంతంటే?
తిరుమల, 20 జూలై (హి.స.)తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) దర్శించుకుంటారు. ఈ క్రమంలో తిరుమలలో కొన్నిసార్లు భక్తుల రద్దీ సాధారణంగా లేదా అధికంగా ఉంటుంది. ఈ తరుణంలో ఇవాళ తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.
తిరుమల


తిరుమల, 20 జూలై (హి.స.)తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) దర్శించుకుంటారు. ఈ క్రమంలో తిరుమలలో కొన్నిసార్లు భక్తుల రద్దీ సాధారణంగా లేదా అధికంగా ఉంటుంది. ఈ తరుణంలో ఇవాళ తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ క్రమంలో నేడు(ఆదివారం) శ్రీవేంకటేశ్వర స్వామి వారిని దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. వారాంతం కావడంతో భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు నిండిపోయి శిలాతోరణం వరకు క్యూలైన్ లో వేచి ఉన్నారు. నిన్న(శనివారం) శ్రీవేంకటేశ్వర స్వామి వారిని 90,011 మంది భక్తులు దర్శించుకున్నారు. 33,328 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవేంకటేశ్వర స్వామి వారిని హుండీ ఆదాయం(Hundi Income) రూ.4.23 కోట్లు వచ్చిందని టీటీడీ(TTD) అధికారులు తెలిపారు. గత నెల(జూన్)లో సాధారణం కంటే అధికంగా శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ నెల(జూలై)లో సాధారణ రోజుల్లో సైతం భక్తుల రద్దీ ఉంటోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande