హైదరాబాద్, 6 ఆగస్టు (హి.స.) కాంగ్రెస్ పార్టీ నాయకులు ఢిల్లీలో దొంగ దీక్షలు కాదు.. నిజమైన దీక్షలు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. సామాజిక తెలంగాణ అంటే ఢిల్లీకి వెళ్లి ఉట్టి ఉట్టి దర్నాలు చేయడం కాదని ఎద్దేవా చేశారు. బీసీల కోసం తాము 72 గంటల పాటు దీక్షకు పూనుకున్నాం అని, కోర్టు నుంచి పర్మిషన్ రాలేదన్నారు. బీసీల కోసం జాగృతి కార్యచరణ సిద్ధం చేస్తుందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. నేడు తెలంగాణ జాగృతి వ్యవస్థాపన దినోత్సవం సందర్భంగా జాగృతి కార్యాలయంలో జెండాను ఆవిష్కరించారు. ప్రొఫెసర్ జయ శంకర్ జయంతి సందర్భంగా చిత్రపటానికి నివాళులర్పించారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్