పులివెందుల ఎన్నికల వేళ ఉద్రిక్తత.. వైసీపీ ఎమ్మెల్సీ రమేశ్‌పై దాడి
పులివెందుల, 6 ఆగస్టు (హి.స.)పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల(Pulivendula ZPTC elections)కు ముందే హైటెన్షన్ వాతావరణం నెలకొంది. వైసీపీ(Ycp), టీడీపీ(Tdp) ఆధిపత్య ధోరణికి పాల్పడుతున్నాయి. మరో నాలుగు రోజుల్లో ఎన్నికలు ఉండగానే రెండు పార్టీ మధ్య పచ్చగడ్డి వేస్త
పులివెందుల ఎన్నికల వేళ ఉద్రిక్తత.. వైసీపీ ఎమ్మెల్సీ రమేశ్‌పై దాడి


పులివెందుల, 6 ఆగస్టు (హి.స.)పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల(Pulivendula ZPTC elections)కు ముందే హైటెన్షన్ వాతావరణం నెలకొంది. వైసీపీ(Ycp), టీడీపీ(Tdp) ఆధిపత్య ధోరణికి పాల్పడుతున్నాయి. మరో నాలుగు రోజుల్లో ఎన్నికలు ఉండగానే రెండు పార్టీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు పార్టీ నేతలు, కార్యకర్తలు ఘర్షణకు దిగుతున్నారు. అధికార పార్టీ అక్రమంగా వ్యవహరిస్తోందని వైసీపీ నేతలు అంటున్నారు. గతంలో మాదిరి దౌర్జన్యం చూస్తూ ఊరుకోమని టీడీపీ నేతలు వార్నింగ్ ఇస్తున్నారు. ఇలా పులివెందుల నియోజకవర్గంలో ఉత్కంఠ, ఉద్రిక్తత కొనసాగుతోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande