లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఇరిగేషన్ అధికారి
తెలంగాణ, జోగులాంబ గద్వాల..7 ఆగస్టు (హి.స.) గద్వాల అలంపూర్ మండల కేంద్రంలోని ఇరిగేషన్ కార్యాలయంలో డిప్యూటీ ఇంజినీర్ శ్రీకాంత్ నాయుడు ప్రైవేట్ కాంట్రాక్టర్ నుండి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. వివరాలకు వెళ్తే అలంపూర్ మున్సిపాలిటీలోకి సంబంధ
ఏసీబీ


తెలంగాణ, జోగులాంబ గద్వాల..7 ఆగస్టు (హి.స.)

గద్వాల అలంపూర్ మండల

కేంద్రంలోని ఇరిగేషన్ కార్యాలయంలో డిప్యూటీ ఇంజినీర్ శ్రీకాంత్ నాయుడు ప్రైవేట్ కాంట్రాక్టర్ నుండి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. వివరాలకు వెళ్తే అలంపూర్ మున్సిపాలిటీలోకి సంబంధించి ఎంబీ మెజర్మెంట్ రికార్డు చేసే విషయంలో సంబంధిత కాంట్రాక్టర్ నుండి డీఈ శ్రీకాంత్ నాయుడు లంచం డిమాండ్ చేశారు.

సుమారు నాలుగు లక్షలకు సంబంధించిన పని కోసం త్రీ పర్సెంట్ లంచం కావాలని డిమాండ్ చేశారు. అందులో భాగంగా 11 వేల రూపాయలు ఇవ్వాలని కోరగా అందుకు ఇష్టపడని ప్రైవేట్ కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను సంప్రదించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande