హైదరాబాద్, 7 ఆగస్టు (హి.స.) అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్ నుంచి తమ దేశానికి వచ్చే దిగుమతులపై అదనంగా మరో 25 శాతం సుంకాలు విధించడంపై ఏఐఎంఐఎం చీఫ్ అసలుద్దీన్ ఓవైసీ ఆగ్రహం వ్యక్తంచేశారు. ట్రంప్ చేష్టలు బఫూన్ బెదిరింపుల్లా ఉన్నాయని ఎద్దేవా చేశారు.
భారత ఎగుమతులపై ట్రంప్ ఇప్పటికే 25 శాతం సుంకాలను అమలు చేస్తున్నారని, ఇప్పుడు అదనంగా మరో 25 శాతం సుంకాలు విధించడంతో మొత్తం టారిఫ్స్ 50 శాతానికి చేరాయని అసదుద్దీన్ అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్