తిరుమల, 7 ఆగస్టు (హి.స.)కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) దర్శించుకుంటారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.
ఈ క్రమంలో నేడు(గురువారం) శ్రీవేంకటేశ్వర స్వామి వారి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. 26 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. క్యూలైన్లోని భక్తులకు శ్రీవేంకటేశ్వర స్వామి వారి సేవకుల ద్వారా అన్నప్రసాదం, పాలు, తాగునీరు అందిస్తున్నారు. నిన్న(బుధవారం) శ్రీవేంకటేశ్వర స్వామి వారిని 71,144 మంది భక్తులు దర్శించుకున్నారు. 28,889 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.
శ్రీవేంకటేశ్వర స్వామి వారి హుండీ ఆదాయం(Hundi Income) రూ.4.15 కోట్లు వచ్చిందని టీటీడీ(TTD) అధికారులు తెలిపారు. గత నెల(జూలై)లో సాధారణ రోజుల్లో సైతం భక్తుల రద్దీ నెలకొంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి