
లద్దాఖ్, 23 మే (హి.స.)లద్దాఖ్ సెక్టార్లో భారత సైన్యానికి చెందిన చీతా అనే హెలికాప్టర్ కుప్పకూలింది. మే 20న జరిగిన ఆ ప్రమాదం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇద్దరు పైలట్లు, డివిజన్ కమాండర్ మేజర్ జనరల్ సచిన్ మెహతా గాయపడ్డారు. అయితే వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలను నిర్ధారించేందుకు ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi