లఖింపూర్ ఘటనపై కీలక వ్యాఖ్యలు చేసిన నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ , 13 అక్టోబర్ (హిం.స)లఖింపూర్ ఖేరి హింసాకాండ ఖండించదగినదేనని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారా
లఖింపూర్ ఘటనపై కీలక వ్యాఖ్యలు చేసిన నిర్మలా సీతారామన్


న్యూఢిల్లీ , 13 అక్టోబర్ (హిం.స)లఖింపూర్ ఖేరి హింసాకాండ ఖండించదగినదేనని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. భారత్లో ఇతర ప్రాంతాల్లో జరిగిన ఈ తరహా ఘటనలను కూడా ప్రస్తావించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న నిర్మలా సీతారామన్ హార్వర్డ్ కెన్నెడి స్కూల్లో బుధవారం జరిగిన ఓ చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

లఖింపూర్ ఖేరి ఘటనలో నలుగురు రైతులు సహా పలువురు మరణించిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ సహా సీనియర్ మంత్రులు ఎందుకు స్పందించలేదనే ప్రశ్నకు బదులిస్తూ ఆమె స్పందించారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో జరిగిన ఘటనే కాకుండా దేశవ్యాప్తంగా ఎక్కడ ఇలాంటివి జరిగినా వాటిని లేవనెత్తాలని మీతో పాటు డాక్టర్ అమర్త్య సేన్ వంటి వారిని తాను కోరుతున్నానని ఆమె పేర్కొన్నారు. లఖింపూర్ ఖేరి ఘటనలో తమ క్యాబినెట్ సహచరుడి పాత్రపై ఆరోపణలు వచ్చాయని దర్యాప్తులో అన్ని విషయాలూ వెలుగుచూస్తాయని అన్నారు.

హిందూస్తాన్ సమాచార్ సంతోషలక్ష్మి


 rajesh pande