జైషే కమాండర్ హతం
జమ్ముకశ్మీర్, 13 అక్టోబర్ (హిం.స) జమ్మూకశ్మీర్లోని ఉగ్రవాదుల ఏరి వేత కొనసాగుతున్నది. అవంతిపోరాలోని త
జైషే కమాండర్ హతం


జమ్ముకశ్మీర్, 13 అక్టోబర్ (హిం.స) జమ్మూకశ్మీర్లోని ఉగ్రవాదుల ఏరి వేత కొనసాగుతున్నది. అవంతిపోరాలోని తిల్వాని మొహల్లా వద్ద బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. మృతుడిని జైషే మహ్మద్ కమాండర్ షామ్ సోఫీగా గుర్తించారు. ప్రస్తుతం ఇంకా ఆపరేషన్ కొనసాగుతున్న అధికార వర్గాలు పేర్కొన్నాయి. మరో ఇద్దరు ముగ్గురు ఉగ్రవాదులు దాక్కున్నట్లుగా భావిస్తున్నారు. ముందు జాగ్రత్తగా ఈ ప్రాంతంలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు.

కార్డన్ను సెర్చ్ పకడ్బందీగా నిర్వహించేందుకు మరిన్ని బలగాలను పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు. గత మూడు రోజుల్లో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరుగడం ఇది ఆరోసారి. భద్రతా బలగాలు ఇప్పటి వరకు ఎనిమిది మంది ఉగ్రవాదులను హతమార్చాయి. మంగళవారం పోషియాన్లో జరిగిన ఎన్కౌంటర్లో ఎల్ఈటీతో సంబంధాలున్న ఐదుగురు ఉగ్రవాదులను బలగాలు హతమార్చిన విషయం తెలిసిందే.

హిందూస్తాన్ సమాచార్ సంతోషలక్ష్మి


 rajesh pande