'జల్ జంగల్ జమీన్' అనే కొమ్రం భీమ్ నినాదంలోని స్పూర్తి,
హైదరాబాద్:, 22 అక్టోబర్ (హిం.స) అడవి బిడ్డల హక్కుల పోరాట యోధుడు, కుమ్రం భీమ్ ఆశయ సాధనకు తెలంగాణ ప్రభ
'జల్ జంగల్ జమీన్' అనే కొమ్రం భీమ్ నినాదంలోని స్పూర్తి,


హైదరాబాద్:, 22 అక్టోబర్ (హిం.స) అడవి బిడ్డల హక్కుల పోరాట యోధుడు, కుమ్రం భీమ్ ఆశయ సాధనకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి వుందని ‘ మా గూడెం, మా తండా, మా రాజ్యం’ అనే ఆదివాసీల తర తరలా ఆకాంక్షను తెలంగాణ ప్రభుత్వం నిజం చేసిందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అన్నారు.

ఆదివాసీల ఆరాధ్యదైవం కుమ్రం భీమ్ జయంతిసందర్భంగా సీఎం కేసీఆర్ కొమ్రం భీమ్సేవలను స్మరించుకుంటూ ఘన నివాళి తెలిపారు. ఆదివాసీల అభివృద్ధి సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలుచేస్తోందని కేసీఆర్ తెలిపారు. కొమ్రం భీమ్జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నదన్నారు. అమరుడు కొమ్రం భీమ్ పోరాట ప్రదేశం జోడేఘాట్ను అన్ని హంగులతో అభివృద్ధి పరిచామన్నారు.

హిందూస్తాన్ సమాచార్-/నాగరాజ్

కొమ్రం భీమ్ స్మారక చిహ్నం, స్మృతివనం, గిరిజన మ్యూజియం ఏర్పాటు చేసి, భీమ్ పోరాట పటిమను భవిష్యత్ తరాలకు తెలియపరిచే విధంగా మౌలిక వసతులను జోడేఘాట్లో ఏర్పాటు చేశామన్నారు. హైదరాబాద్ నడిబొడ్డున ఆదివాసీల ఆత్మగౌరవాన్ని నిలిపేలా ఆదివాసీ భవన్ నిర్మాణం చేపట్టినామని తెలిపారుహిందూస్తాన్ సమాచార్


 rajesh pande