తాజాగా 16 వేలకు దిగువన కేసులు
దిల్లీ :.అక్టోబర్ 24 (హింస)‘ భారత్లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కేసులు, మరణాల్లో హెచ్చుతగ్గులు న
తాజాగా 16 వేలకు దిగువన కేసులు


దిల్లీ :.అక్టోబర్ 24 (హింస)‘ భారత్లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కేసులు, మరణాల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. అంతక్రితం రోజుతో పోల్చితే తాజా కేసుల సంఖ్యలో స్వల్ప తగ్గుదల నమోదైంది. తాజాగా 16 వేలకు దిగువన కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇక మరణాల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది.

* గడిచిన 24 గంటల్లో 13,40,158 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 15,906 కేసులు వెలుగులోకి వచ్చాయి.

* ఇక పలు రాష్ట్రాలు మరణాల సంఖ్యను సవరిస్తుండటంతో ఈ సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. నిన్న 561 మంది కొవిడ్తో మృత్యువాత పడ్డారు. దీంతో ఇప్పటి వరకూ ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 454269కి చేరింది.

హిందుస్థాన్ సమాచార నాగరాజ్


 rajesh pande