పాక్ లో భారీ భూకంపం
పాకిస్తాన్, 7 అక్టోబర్ (హిం.స) పాకిస్థాన్లోని బలూచిస్థాన్ ప్రావిన్స్ భూకంపంతో వణికిపోయింది. బలూచిస్థ
పాక్ లో భారీ భూకంపం


పాకిస్తాన్, 7 అక్టోబర్ (హిం.స) పాకిస్థాన్లోని బలూచిస్థాన్ ప్రావిన్స్ భూకంపంతో వణికిపోయింది. బలూచిస్థాన్ ప్రావిన్స్లోని హర్నోయ్లో గురువారం తెల్లవారుజామున 3.30 సమయంలో భూమి కంపించింది. దీని తీవ్రత 5.7గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ వెల్లడించింది. భూకంపం ధాటికి 20 మంది చనిపోయారని, 200 మందికి పైగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. మృతుల్లో మహిళలు, ఆరుగురు చిన్నారులు కూడా ఉన్నారని చెప్పారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని బలూచిస్థాన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అధికారి నసీర్ నాసర్ చెప్పారు.

హిందూస్తాన్ సమాచార్ సంతోషలక్ష్మి


 rajesh pande