వికలాంగులకు త్రిచక్ర వాహనాలు అందజేయాలని ఎమ్మెల్యేకు వినతి
తెలంగాణ: మహబూబ్ నగర్ జిల్లా:నవంబర్ 24( హిం స) అర్హతగల వికలాంగులకు మూడు చక్రాల పెట్రోల్ మోటార్ వాహనాల
వికలాంగులకు త్రిచక్ర వాహనాలు అందజేయాలని ఎమ్మెల్యేకు వినతి


తెలంగాణ: మహబూబ్ నగర్ జిల్లా:నవంబర్ 24( హిం స)

అర్హతగల వికలాంగులకు మూడు చక్రాల పెట్రోల్ మోటార్ వాహనాలు ఇవ్వాలని మండల పరిధిలోని పోలేపల్లి గ్రామానికి చెందిన వికలాంగులు బుధవారం జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ని మాచారం గ్రామంలో కలసి వినతి పత్రం అందజేశారు. అర్హతగల వికలాంగులకు ప్రభుత్వం ద్వారా మూడు చక్రాల మోటార్ సైకిల్లను అందజేయాలని ఎమ్మెల్యేలను కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వికలాంగుల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతున్నారని, వారి అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని తెలిపారు. అర్హులైన వికలాంగులను గుర్తించి త్వరలోనే ప్రభుత్వం ద్వారా వికలాంగులకు వాహనాలను అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, గ్రామ సర్పంచ్ చేతన రెడ్డి, పిఎసిఎస్ ఇన్చార్జ్ చైర్మన్ సుధాకర్ రెడ్డి నాయకులు రఘుపతి రెడ్డి, రవీందర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, అశోక్ గౌడ్, వికలాంగులు బురాన్, కృష్ణయ్య, అలివేల, జంగయ్య తదితరులు పాల్గొన్నారు.

హిందూస్తాన్ సమాచార్ మహి పాల్ రెడ్డి


 rajesh pande