తెలంగాణ : హైదరాబాద్: నవంబర్ 24 ( హింస)
జీహెచ్ఎంసీలో జరిగిన ఘటనపై 32 మంది బీజేపీ కార్పొరేటర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనపై జీహెచ్ఎంసీ ఉద్యోగులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదయింది. సైఫాబాద్ పోలీసులు జీహెచ్ఎంసీలోని సీసీ ఫుటేజ్ సేకరించి, దాని ఆధారంగా కేసులు నమోదు చేశారు.
పుట్ట సుమన్, హిందుస్థాన్ సమాచార.