ఎల్ఈడి దీపాలతో 100 కోట్లు ఆదా...
తెలంగాణ:హైదరాబాద్ జిల్లా:నవంబర్ 25( హిం స) జిహెచ్ఎంసి తో పాటు రాష్ట్రవ్యాప్తంగా 142 పట్టణ స్థానిక సం
ఎల్ఈడి దీపాలతో 100 కోట్లు ఆదా...


తెలంగాణ:హైదరాబాద్ జిల్లా:నవంబర్ 25( హిం స)

జిహెచ్ఎంసి తో పాటు రాష్ట్రవ్యాప్తంగా 142 పట్టణ స్థానిక సంస్థలలో ఎల్ఈడి వీధి దీపాలను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తెలిపారు....

వీటి వల్ల ప్రభుత్వ ఖజానాకు ఏటా 100 కోట్ల నిధులు ఆదా అవుతున్నాయని ట్విట్టర్ లో నేడే గురువారం పేర్కొన్నారు. ఈ ఘనత అంతా మున్సిపల్ శాఖ బృందానిదేనని కొనియాడారు. గచ్చిబౌలిలోని పురాణతబావిని పునరు ధరించి పూర్వస్థితికి తీసుకోవచ్చిన అధికారులను మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అభినందించారు. వెల్ డన్ అంటూ తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ చీరెక్ స్కూల్. రేయిన్ వాటర్ సంస్థను. కల్పన రమేష్ ను. ట్విట్టర్ లో అభినందించారు. గచ్చిబౌలిలోని పురాతన బావిని చిరేక్ స్కూల్. రేయిన్ వాటర్. సమస్థ సహకారంతో పునరుదించినట్లు తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్. ట్విట్టర్ లో తెలిపారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మరికొన్ని స్కూల్స్ ముందుకు రావాలని పిలుపునిచ్చారు.....

హిందూస్తాన్ సమాచార్ మహి పాల్ రెడ్డి


 rajesh pande