ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్ధి ఎలికట్ట కావలి శ్రీశైలం నామినేషన్ ఉప సంహరణ
ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్ధి ఎలికట్ట కావలి శ్రీశైలం నామినేషన్ ఉప సంహరణ తెలంగాణ:మహబూబ్ నగర్ జిల్లా:నవ
ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్ధి ఎలికట్ట కావలి శ్రీశైలం నామినేషన్ ఉప సంహరణ


ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్ధి ఎలికట్ట కావలి శ్రీశైలం నామినేషన్ ఉప సంహరణ

తెలంగాణ:మహబూబ్ నగర్ జిల్లా:నవంబర్ 25( హిం స)మహబూబ్ నగర్ స్థానిక సంస్థల శాసన మండలి సభ్యుల స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం ఎలికట్టకు చెందిన కావలి శ్రీశైలం తన నామినేషన్ ను ఉపసంహరించుకున్నట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్ .వెంకట్ రావు మీడియాకు తెలిపారు. ఈ మేరకు గురువారం సుధాకర్ రెడ్డి తనను తన ఛాంబర్లో కలిసి నామినేషన్ ను ఉప సంహరించుకుంటున్నట్లుగా రాత పూర్వకంగా తనకు అందజేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. దీంతో మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో టిఆర్ఎస్ కు చెందిన అభ్యర్థులు కశిరెడ్డి నారాయణ రెడ్డి, కూచుకుళ్ల దామోదర రెడ్డి మాత్రమే మిగిలారని పేర్కొన్నారు. రెండు స్థానిక సంస్థల ఎంఎల్ సి స్థానాలకు కేవలం ఇద్దరు అభ్యర్థులే ఉండడంతో మహబూబ్ నగర్ స్థానిక సంస్థల శాసన మండలి సభ్యుల ఎన్నిక ఏకగ్రీవమైందని భావించవచ్చు..

హిందుస్థాన్ సమాచార్ మహి పాల్ రెడ్డి


 rajesh pande