హైదరాబాద్: నగరంలో భారీ మొత్తంలో గంజాయి పట్టుబడింది. అంతర్రాష్ట్ర గంజాయి ముఠాను అరెస్టు చేసిన పోలీసులు వారి వద్ద నుంచి 1,820 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ రూ.3కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. విశాఖ సీలేరు నుంచి మహారాష్ట్రకు తరలిస్తుండగా రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గుర్తించిన పోలీసులు.. గంజాయిని సీజ్ చేసి దాన్ని తరలిస్తున్న ఐదుగురిని అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి సీపీ మహేశ్ భగవత్ మధ్యాహ్నం 3గంటలకు వివరాలు వెల్లడించనున్నారు.
హిందుస్థాన్ సమాచార /నాగరాజ్