ఆంధ్రప్రదేశ్ సహా 7 రాష్ట్రాల్లో చేపట్టిన రూ.20వేల కోట్ల విలువైన 8 ప్రాజెక్టులపై సమీక్ష
న్యూఢిల్లీ, 25 నవంబర్ (హిం.స): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం జరిగిన 39వ ‘ప్రగతి’ సమావేశంలో ఆంధ్ర
ఆంధ్రప్రదేశ్ సహా 7 రాష్ట్రాల్లో చేపట్టిన రూ.20వేల కోట్ల విలువైన 8 ప్రాజెక్టులపై సమీక్ష


న్యూఢిల్లీ, 25 నవంబర్ (హిం.స): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం జరిగిన 39వ ‘ప్రగతి’ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ సహా 7 రాష్ట్రాల్లో చేపట్టిన రూ.20వేల కోట్ల విలువైన 8 ప్రాజెక్టులపై సమీక్ష జరిపారు. ప్రధాన అధ్యక్షతన 9 అంశాల ఎజెండాతో జరిగిన ఈ సమావేశంలో 8 ప్రాజెక్టులతోపాటు ఒక పథకంపై సమీక్ష జరిగినట్లు ప్రధాని కార్యాలయం (పీఎంవో) తెలిపింది. ఆంధ్రప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, గుజరాత్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్ల్లో చేపట్టిన 3 రైల్వే ప్రాజెక్టులు, రోడ్డు రవాణా, హైవేశాఖ, విద్యుత్ శాఖలకు చెందిన రెండేసి ప్రాజెక్టులు, పెట్రోలియం, సహజవాయువు శాఖకు చెందిన ఒక ప్రాజెక్టు ఇందులో ఉన్నాయి.

హిందూస్తాన్ సమాచార్/నాగరాజ్


 rajesh pande