లక్నో: సెప్టెంబర 18( హింస)పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చే విషయంలో జీఎస్టీ కౌన్సిల్ మరోసారి మొండిచేయి చూపించింది. పెట్రో ఉత్పత్తులను తీసుకురావడానికి ఇది తగిన సమయం కాదని జీఎస్టీ మండలి అభిప్రాయపడిందని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. జీఎస్టీ పరిధిలోకి పెట్రో ఉత్పత్తులను తీసుకొచ్చే అంశాన్ని పరిశీలించాలని కేరళ హైకోర్టు సూచించిన నేపథ్యంలో సమావేశంలో దాన్ని అజెండాలో చేర్చి చర్చించామని వివరించారు. లఖ్నవూలో జరిగిన 45వ జీఎస్టీ కౌన్సిల్ అనంతరం కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మీడియా సమావేశంలో ఆమె వెల్లడించారు
హిందుస్థాన్ సమాచార నాగరాజ్ సంతోషలక్ష్మి