ఆంధ్ర ప్రదేశ్ :అమరవతి : సెప్టెంబర్ 25 ( హింస)
కృష్ణా జిల్లాలో అక్రమంగా నెల్లూరు నుంచి కాకినాడ పోర్ట్కు తరలిస్తున్న 40 టన్నుల రేషన్ బియ్యం పట్టుబడింది. గన్నవరం లక్ష్మీ కాటా వద్ద 2 లారీలతో వెళుతున్న రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. పట్టుబడిన రెండు రేషన్ బియ్యం లారీలను గన్నవరం రెవెన్యూ అధికారులు ఆత్కూరు పోలీస్ స్టేషన్కు తరలించారు.
పుట్ట సుమన్, హిందుస్థాన్ సమాచార.