మంత్రి పదవి పోయినా భయపడను: మంత్రి బాలినేని
ఆంధ్ర ప్రదేశ్ :అమరవతి : సెప్టెంబర్ 25 ( హింస) సీఎం జగన్ నేతృత్వంలో త్వరలో మంత్రివర్గంలో భారీ మార్
మంత్రి పదవి పోయినా భయపడను: మంత్రి బాలినేని


ఆంధ్ర ప్రదేశ్ :అమరవతి : సెప్టెంబర్ 25 ( హింస)

సీఎం జగన్ నేతృత్వంలో త్వరలో మంత్రివర్గంలో భారీ మార్పులు జరుగుతాయని మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంత్రివర్గంలోకి 100 శాతం కొత్తవారిని తీసుకుంటారని ఆయన తెలిపారు. పార్టీ విధాన నిర్ణయానికి కట్టుబడి ఉంటానని సీఎంతో చెప్పానని మంత్రి బాలినేని పేర్కొన్నారు. తన మంత్రి పదవి పోయినా భయపడనని మంత్రి బాలినేని అన్నారు.

పుట్ట సుమన్, హిందుస్థాన్ సమాచార.


 rajesh pande