పాక్కు కమలా హ్యారిస్ హితవు
వాషింగ్టన్:, 25 సెప్టెంబర్ (హిం.స) పాకిస్తాన్లో ఎన్నో ఉగ్రవాద సంస్థలు ఉన్నాయని, వాటన్నింటిపైనా అక్క
పాక్కు కమలా హ్యారిస్ హితవు


వాషింగ్టన్:, 25 సెప్టెంబర్ (హిం.స) పాకిస్తాన్లో ఎన్నో ఉగ్రవాద సంస్థలు ఉన్నాయని, వాటన్నింటిపైనా అక్కడి ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ హితవు పలికారు. అప్పుడే అమెరికా, భారత్లపై ఉగ్రవాదం నీడ పడకుండా భద్రంగా ఉంటాయని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ తన అమెరికా పర్యటనలో భాగంగా గురువారం రాత్రి కమలా హ్యారిస్తో భేటీ అయినప్పుడు ఉగ్రవాదం విసురుతున్న సవాళ్ల గురించి మాట్లాడుతూ కమల తనంతట తానుగా పాక్ ప్రస్తావన తెచ్చారు

హిందూస్తాన్ సమాచార్,నాగరాజ్


 rajesh pande