పెంజర్లలో వీఆర్ఏపై దాడి - పోలీసులకు ఫిర్యాదు
కొత్తూరు, రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పెంజర్ల గ్రామంలో సర్కారీ భూమి విషయంలో గ్రామ విఆర్ఏ ఫై దాడ
*పెంజర్లలో వీఆర్ఏపై దాడి - పోలీసులకు ఫిర్యాదు*


కొత్తూరు, రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పెంజర్ల గ్రామంలో సర్కారీ భూమి విషయంలో గ్రామ విఆర్ఏ ఫై దాడి జరిగింది. ఈ సంఘటనలో సదరు విఆర్ఏను నరికి చంపుతామని బెదిరించడం తో సదరు బాధితుడు కొత్తూరు తాహసిల్దార్ రాములు ఆదేశాల మేరకు కొత్తూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలోని పెంజర్ల గ్రామానికి చెందిన విఆర్ఏ కావలి శేఖర్ సర్వే నెంబర్ 294 లో గల 23 ఎకరాల పదిగంటల విస్తీర్ణం గల భూమికి సంబంధించి అందులోని చెట్లను అదే గ్రామానికి చెందిన

కావలి నరసింహులు, కావలి శీను నరికి వేశారు. ఈ విషయాన్ని స్థానిక గీర్దావర్ దృష్టికి తీసుకురాగా ఆయన వారిని వారించమని ఆదేశాలు ఇచ్చారు. చెట్లను నరక వద్దు అని చెప్పడంతో సదరు వ్యక్తులు రెవిన్యూ సిబ్బంది కావలి శేఖర్ ను బూతులు తిడుతూ దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. అదే విధంగా సర్కారీ భూమిలో కాలు పెడితే నరికి చంపుతామంటూ వీఆర్ఏ శేఖరును బెదిరించినట్లు ఫిర్యాదులో తెలిపారు. ఈ విషయమై తాసిల్దార్ రాములును కొత్తూరు సిటీటైమ్స్ ప్రతినిధి వివరణ కోరగా ఆయన జరిగిన విషయాన్ని చెప్పారు. నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని రెవెన్యూ సిబ్బంది కోరుతున్నారు..

జనార్దన్ రెడ్డి:రంగా రెడ్డి జిల్లా:హిందుస్తాన్ సమాచార్


 rajesh pande