ఢిల్లీ : జనవరి 19( హింస) దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:27 గంటల సమయంలో సెన్సెక్స్ 224 పాయింట్ల నష్టంతో 60,821 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 70 పాయింట్లు నష్టపోయి 18,095 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 81.31 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్ 30 సూచీలో యాక్సిస్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, సన్ఫార్మా, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎల్అండ్టీ, ఐటీసీ, పవర్గ్రిడ్, ఎన్టీపీసీ, మారుతీ షేర్లు లాభాల్లో ఉన్నాయి. కొటాక్ మహీంద్రా బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్స్, టైటన్, భారతీ ఎయిర్టెల్, హెచ్యూఎల్, ఇన్ఫోసిస్, బజాజ్ ఫిన్సర్వ్, విప్రో, టీసీఎస్, ఎల్అండ్టీ, హెచ్సీఎల్ టెక్ నష్టాల్లో కొనసాగుతున్నాయి.
పుట్ట సుమన్, హిందూస్తాన్ సమాచార