తెలంగాణ రంగా రెడ్డి షాద్ నగర్ జనవరి:21 (హిం.స) రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ప్రభుత్వ వ్యవసాయ మార్కెట్ యార్డులో మళ్లీ దొంగతనం జరిగింది. రాత్రి గుడిపల్లి రంగయ్య గుప్తా అండ్ సన్స్ 27వ నెంబర్ షాపులొ దొంగలు పడ్డారు.
అయితే ఈ దొంగతనంపై ఫిర్యాదు చేయడానికి అటు బాధితులు కానీ ఇటు మార్కెట్ సిబ్బంది కానీ పోలీసులను ఆశ్రయించకపోవడం గమనర్హం. గతంలో పోలీసులు మార్కెట్ యార్డ్ సిబ్బంది తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన దాఖలాలు ఉన్నాయి.
జనార్దన్ రెడ్డి ,హిందూస్థాన్ సమాచార్