ఢిల్లీ : జనవరి 24( హింస) ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ ఎల్-సిసి మంగళవారం న్యూఢిల్లీకి చేరుకున్నారు. ఆయనకు ఘన స్వాగతం లభించింది. 74వ గణతంత్ర దినోత్సవ పరేడ్కు ఆయన ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. జనవరి 24-27 వరకు ఆయన అధికారిక పర్యటన కోసం ఐదుగురు మంత్రులు, సీనియర్ అధికారులతో సహా ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం ఆయనతో కలిసి ఇండియాకు విచ్చేశారు. ఆయన ఢిల్లీకి చేరుకున్నప్పుడు సాంప్రదాయ జానపద నృత్యంతో స్వాగతం పలికారు. గణతంత్ర దినోత్సవానికి ఈజిప్టు అధ్యక్షుడిని ముఖ్య అతిథిగా ఆహ్వానించడం ఇదే తొలిసారి.
పుట్ట సుమన్, హిందూస్తాన్ సమాచార