వసంత పంచమి సందర్భంగా 108 ప్రత్యేక బస్సులు
తెలంగాణ : హైదరాబాద్ : జనవరి24( హింస) వసంత పంచమి సందర్భంగా భక్తుల సౌకర్యార్థం టీఎస్ ఆర్టీసీ 108 ప్రత్
వసంత పంచమి సందర్భంగా 108 ప్రత్యేక బస్సులు


తెలంగాణ : హైదరాబాద్ : జనవరి24( హింస)

వసంత పంచమి సందర్భంగా భక్తుల సౌకర్యార్థం టీఎస్ ఆర్టీసీ 108 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. నిర్మల్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసరకు 88 బస్సులు, సిద్దిపేట జిల్లాలోని వర్గల్కు 20 ప్రత్యేక బస్సులను నడపనుంది. బుధ, గురువారాల్లో ఈ బస్సులు తిరుగుతాయి. బాసరకు హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి 21, జేబీఎస్ నుంచి 12, నిజామాబాద్ నుంచి 45, హన్మకొండ నుంచి 5, కరీంనగర్ నుంచి 4, జగిత్యాల నుంచి ఒక బస్సును ఏర్పాటు చేసింది. వర్గల్కు సికింద్రాబాద్(గురుద్వారా) నుంచి ప్రతి అరగంటకో బస్సు నడిచే విధంగా టీఎస్ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేశారు. సికింద్రాబాద్ గురుద్వారా నుంచి 10, జేబీఎస్ నుంచి 6, గజ్వేల్ నుంచి 2, సిద్దిపేట నుంచి 2 బస్సులను నడుపుతున్నారు. ఈ ప్రత్యేక బస్సు సర్వీస్ లను ఉపయోగించుకుని భక్తులంతా క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు.

పుట్ట సుమన్, హిందూస్తాన్ సమాచార


 rajesh pande