తెలంగాణ : హైదరాబాద్ : జనవరి24( హింస)
చదువుల తల్లి కొలువైన నిర్మల్ జిల్లా బాసరలో వసంత పంచమి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఆలయ వైదిక పండితులు గోమాతకు పూజలు చేసి హోమం నిర్వహించి వేడుకలు ప్రారంభించారు. గురువారం వరకు బాసరలో వసంత పంచమి వేడుకలు జరగనున్నాయి. తెల్లవారు జాము ఒకటిన్నర గంటలకు మంగళవాయిద్యసేవ, సుప్రభాత సేవలతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అమ్మవారికి చండీవాహనం, వేదపారాయణంతో పాటు మహా పూజలు నిర్వహిస్తున్నారు.
పుట్ట సుమన్, హిందూస్తాన్ సమాచార