ఢిల్లీ,,జనవరి 31( హింస) లండన్ నగరంలోని హౌన్సలో పట్టణంలో తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ ఆరవ వార్షికోత్సవ వేడుకలతో పాటు గణతంత్ర దినోత్సవం చాలా ఘనంగా నిర్వహించారు.
మొదటగా 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉపాధ్యక్షురాలు శుషుమ్నా రెడ్డి మువన్నెల పతాక ఆవిష్కరణ చేశారు. ఆ తర్వాత అమరవీరులకు రెండు నిమిషాలు మౌనం పాటించి, దేశ స్వాతంత్ర సమరయోధులకు, జయశంకర్కు నివాళులు అర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల మాట్లాడుతూ, యావత్తు దేశ ప్రజలు ఈ రోజున గణతంత్ర దినోత్సవాన్ని పండుగగా జరుపుకుంటున్న ఈ శుభ సమయంలో మన దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన ఎందరో అమర వీరులను, త్యాగమూర్తులను స్మరించుకున్నారు. టాక్ సభ్యులందరికి ఆరవ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
హిందుస్థాన్ సమాచార/ నాగరాజ్