ఇండియా వస్తున్న కార్గో షిప్ హైజాక్… హౌతీ మిలిటెంట్ల ఉగ్రవాద చర్య
ఢీల్లీ, 20 నవంబర్ (హిం.స) భారతదేశానికి వెళుతున్న కార్గో షిప్ ను హౌతీ మిలిటెంట్లు హెలికాప్టర్ సాయంతో
ఇండియా వస్తున్న కార్గో షిప్ హైజాక్… హౌతీ మిలిటెంట్ల ఉగ్రవాద చర్య


ఢీల్లీ, 20 నవంబర్ (హిం.స)

భారతదేశానికి వెళుతున్న కార్గో షిప్ ను హౌతీ మిలిటెంట్లు హెలికాప్టర్ సాయంతో హైజాక్ చేశారు. యెమెన్ దేశానికి చెందిన హౌతీ మిలీషియా దక్షిణ ఎర్ర సముద్రంలో భారత్కు చెందిన అంతర్జాతీయ కార్గో షిప్ను స్వాధీనం చేసుకున్నట్లు ఇజ్రాయెల్ తెలిపింది.

భారత్ కార్గో షిప్ హైజాక్ చేయడం ఇరానియన్ ఉగ్రవాద చర్య అని ఇజ్రాయెల్ పేర్కొంది. హైజాక్ అయిన ఓడలో ఓడలో ఇజ్రాయెల్ పౌరులు ఎవరూ లేరని అధికారులు తెలిపారు.

దక్షిణ ఎర్ర సముద్రం నుండి నౌకను యెమెన్ నౌకాశ్రయానికి తీసుకువెళ్లినట్లు బృందం తెలిపింది. హౌతీలు హెలికాప్టర్ను ఉపయోగించి ఓడపై ఫైటర్లను దించడం ద్వారా హైజాక్ చేశారు. ఈ కార్గో షిప్ బ్రిటీష్ కంపెనీకి చెందినదని, దీనిని జపాన్ కంపెనీ నిర్వహిస్తోందని టెల్ అవీవ్ తెలిపింది. నౌకలో ఉక్రేనియన్, బల్గేరియన్, ఫిలిప్పీన్స్, మెక్సికన్ సహా వివిధ దేశాలకు చెందిన 25 మంది సిబ్బంది ఉన్నారు.

హిందూస్తాన్ సమాచార్,సంధ్యా


 rajesh pande