రామమందిరాన్ని బాంబులతో కూల్చేస్తామనిబెదిరింపు ఫోన్ కాల్
ఉత్తరప్రదేశ్ : ఫిబ్రవరి 3( హింస) అయోధ్య రామమందిరాన్ని బాంబులతో కూల్చేస్తామని ఓ ఆగంతకుడు చేసిన బెదిరి
రామమందిరాన్ని బాంబులతో కూల్చేస్తామనిబెదిరింపు ఫోన్ కాల్


ఉత్తరప్రదేశ్ : ఫిబ్రవరి 3( హింస) అయోధ్య రామమందిరాన్ని బాంబులతో కూల్చేస్తామని ఓ ఆగంతకుడు చేసిన బెదిరింపు ఫోన్ కాల్ కలకలం సృష్టించింది. ఫోన్ చేసిన ఆ వ్యక్తి ఆలయాన్ని పేల్చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ బెదిరింపు కాల్ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ పోలీసులు అప్రమత్తమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. గురువారం ప్రయాగ్రాజ్కు చెందిన మనోజ్ కుమార్ అనే వ్యక్తికి అయోధ్య రామమందిరాన్ని కూల్చేస్తామని బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. మనోజ్ కుమార్ అయోధ్యలోని రాంలాలా సదన్ నివాసి కాగా.. ప్రస్తుతం ప్రయాగ్రాజ్లోని కల్పవస్లో ఉన్నాడు. అయితే, మనోజ్కు ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. కాల్లో మరికొన్ని గంటల్లో శ్రీరామ జన్మభూమి ఆలయాన్ని బాంబులతో పేల్చేస్తామని బెదిరించారు.

ఈ నేపథ్యంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేసేందుకు కాల్ ట్రాకింగ్ ఆధారంగా గుర్తించే పనిలో ఉన్నారు.

పుట్ట సుమన్, హిందూస్తాన్ సమాచార


 rajesh pande