లిక్కర్ కేసు నిందితులకు కఠిన శిక్ష విధించాలి... భట్టి విక్రమార్క
తెలంగాణ: ఖమ్మం: ఫిబ్రవరి 4 (హిం.స) లిక్కర్ అవినీతి కేసులో కూరుకుపోయిన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రివాల్
లిక్కర్ కేసు నిందితులకు కఠిన శిక్ష విధించాలి... భట్టి విక్రమార్క


తెలంగాణ: ఖమ్మం: ఫిబ్రవరి 4 (హిం.స) లిక్కర్ అవినీతి కేసులో కూరుకుపోయిన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రివాల్ తోపాటు ఆ కేసులో ఉన్న అందరిపైన చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణా రాష్ట్ర సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

అవినీతికి వ్యతిరేకంగా సమాజంతో పాటు ప్రభుత్వ నిర్మాణం చేస్తానని చెప్పిన కేజ్రివాల్ దేశంలో ఉన్నటువంటి అనేక మంది యువతి యువకులను, ముఖ్యంగా గాంధేయవాదులను మోసం చేశాడని మండి పడ్డారు.

అవినీతి లేని సమాజ నిర్మాణం చేస్తానని చెప్పిన కేజీవాల్ మాటలు నమ్మి ఓట్లు వేసి గెలిపిస్తే ఇంత మందిని మోసం చేసి అవినీతిలో మునిగి తేలితే ఇంత కంటే ప్రమాదకరమైన విషయం ఇంకొకటి ఉండదని తాను భావిస్తున్నానని అన్నారు.

సంపత్ రావు, హిందుస్థాన్ సమాచార


 rajesh pande