తెలంగాణ; వరంగల్: ఫిబ్రవరి 4 (హిం.స) ప్రముఖ సినీ నేపథ్య గాయని, పద్మభూషణ్ పురస్కార గ్రహీత శ్రీమతి వాణీ జయరామ్ గారి మృతి పట్ల రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంతాపం తెలిపారు.
మాసైనా, క్లాస్ అయినా, క్లాసికల్ అయినా. జాజ్ అయినా ఆమె తన గొంతుతో పాటలకు ప్రాణం పోసి శ్రోతలను అలరించిన గొప్ప గాయని అన్నారు. 14 భాషల్లో 20 వేలకు పైగా పాటలు పాడిన వాణీ జయరాం సినీ రంగానికి అందించిన సేవలు విశేషమైనవి అన్నారు.
సంపత్ రావు, హిందుస్థాన్ సమాచార