తొలి మ్యాచ్లోనే పాక్తో ఢీ-మహిళల టీ20 ప్రపంచకప్-2023
ఢిల్లీ,,ఫిబ్రవరి 04( హింస)దక్షిణాఫ్రికా వేదికగా జరగనున్న ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్-2023కు సర్వం సిద
 టీ20 ప్రపంచకప్‌-2023


ఢిల్లీ,,ఫిబ్రవరి 04( హింస)దక్షిణాఫ్రికా వేదికగా జరగనున్న ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్-2023కు సర్వం సిద్దమైంది. ఈ మెగా టోర్నీ ఫిబ్రవరి 10 నుంచి షూరూ కానుంది. ఆ తొలి మ్యాచ్లో కేప్ టౌన్ వేదికగా అతిథ్య దక్షిణాఫ్రికాతో శ్రీలంక తలపడనుంది.

ఈ మెగా ఈవెంట్లో మొత్తం 10 జట్లు టైటిల్ కోసం తలపడనున్నాయి. వీటిని రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-ఏలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు, గ్రూప్-బిలో ఇంగ్లండ్, భారత్, పాకిస్తాన్, వెస్టిండీస్, ఐర్లాండ్ జట్లు ఉన్నాయి.

ఇక భారత్ తమ తొలి మ్యాచ్లోనే చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్తో తలపడనుంది. ఈ హైవోల్టేజ్ మ్యాచ్ ఫిబ్రవరి 12న కేప్ టౌన్ వేదికగా జరగనుంది.

హిందుస్థాన్ సమాచార/ నాగరాజ్


 rajesh pande