దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో
ముంబయి, 1 మార్చి (హిం.స): దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మా
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో


ముంబయి, 1 మార్చి (హిం.స): దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల వవనాలు ఉన్నప్పటికీ.. మన సూచీలకు కనిష్ఠాల వద్ద కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. ఉదయం 9:22 గంటల సమయంలో సెన్సెక్స్ 363 పాయింట్ల లాభంతో 59,325 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 103 పాయింట్లు లాభపడి 17,407 దగ్గర కొనసాగుతోంది.

డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.39 దగ్గర కొనసాగుతోంది. సెన్సెక్స్ 30 సూచీలో టాటా స్టీల్, ఎంఅండ్ఎం, యాక్సిస్ బ్యాంక్, టీసీఎస్, ఎల్అండ్టీ, హెచ్సీఎల్ టెక్, టాటా మోటార్స్, మారుతీ, టెక్ మహీంద్రా, ఎస్బీఐ, బజాజ్ ఫిన్సర్వ్, భారతీ ఎయిర్టెల్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. పవర్గ్రిడ్ మాత్రమే నష్టాల్లో కొనసాగుతోంది.

హిందుస్థాన్ సమాచార,నాగరాజ


 rajesh pande