ముంబయి: మార్చ్ 20,( హింస )దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:23 గంటల సమయంలో సెన్సెక్స్ (Sensex) 518 పాయింట్ల నష్టంతో 57,471 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 159 పాయింట్లు నష్టపోయి 16,940 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 10 పైసలు పుంజుకొని 82.49 దగ్గర ప్రారంభమైంది. సెన్సెక్స్ 30 సూచీలో ఒక్క హెచ్యూఎల్ మాత్రమే లాభాల్లో ఉంది. టాటా స్టీల్, ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా మోటార్స్, ఎంఅండ్ఎం, ఇన్ఫోసిస్, ఎస్బీఐ, టీసీఎస్, మారుతీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, పవర్గ్రిడ్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ అత్యధికంగా నష్టపోతున్న షేర్ల జాబితాలో ఉన్నాయి.
హిందుస్థాన్ సమాచార నాగరాజ్