తెలంగాణ : హైదరాబాద్ : మార్చ్ 24( హింస )
టీఎస్పీఎస్పీ పేపర్ లీకేజీ వ్యవహారంపై మంత్రి లీగల్ నోటీసులు పంపడంపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. నోటీసులకు భయపడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. చట్ట, న్యాయబద్దంగా తగిన సమాధానమిస్తాం అని తెలిపారు. రాజకీయంగా, ప్రజా క్షేత్రంలో పోరాడతామన్నారు. అంతే తప్ప కేసీఆర్ సర్కార్ తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
పుట్ట సుమన్, హిందూస్తాన్ సమాచార