టెన్త్ పరీక్ష కేంద్రాలకు ఉచిత రవాణా సౌకర్యం
ఆంధ్ర ప్రదేశ్ : అమరావతి : మార్చ్ 24 (హిం స) విద్యార్థుల సౌకర్యార్థం టెన్త్ పరీక్ష కేంద్రాలకు ఉచిత రవ
టెన్త్ పరీక్ష కేంద్రాలకు ఉచిత రవాణా సౌకర్యం


ఆంధ్ర ప్రదేశ్ : అమరావతి : మార్చ్ 24 (హిం స) విద్యార్థుల సౌకర్యార్థం టెన్త్ పరీక్ష కేంద్రాలకు ఉచిత రవాణా కల్పించాలని ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బ్రహ్మానందరెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

ఈ మేరకు పరీక్ష కేంద్రాలకు పల్లె వెలుగు, సిటీ సర్వీసులను అందుబాటులో ఉంచాలని ఆర్టీసీ రీజనల్ మేనేజర్ చెంగల్రెడ్డి డిపో మేనేజర్లను ఆదేశించారు. పాసులతో పనిలేకుండా హాల్ టికెట్ ఉంటే అనుమతించాలన్నారు. ఏప్రిల్ 3నుంచి 18వ తేదీ వరకు ఇది అమలు చేయాలని స్పష్టం చేశారు.

హిందుస్థాన్ సమాచార/రాజీవ్


 rajesh pande