విజయవాడ 65వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం
ఆంధ్ర ప్రదేశ్ : అమరావతి : మార్చ్ 24 (హిం స) విజయవాడ 65వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. చౌటు
విజయవాడ 65వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం


ఆంధ్ర ప్రదేశ్ : అమరావతి : మార్చ్ 24 (హిం స) విజయవాడ 65వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. చౌటుప్పల్ మండలం లింగోజిగూడెం వద్ద బస్సును వెనక నుంచి లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ క్యాబిన్ నుజ్జునుజ్జయింది.

క్యాబిన్‎లోనే డ్రైవర్, క్లీనర్ ఇరుక్కుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్యాబిన్‎లో ఇరుక్కుపోయిన డ్రైవర్, క్లీనర్‎లను సుమారు రెండు గంటల పాటు శ్రమించి పోలీసులు స్థానికుల సహాయంతో బయటికి తీశారు. ఇద్దరిని ఆస్పత్రికి తరలించే క్రమంలో మార్గమధ్యలో క్లీనర్ మృతి చెందాడు. డ్రైవర్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. బస్సులో ఉన్న ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

హిందుస్థాన్ సమాచార/,రాజీవ్


 rajesh pande