తెలంగాణ : హైదరాబాద్ : మార్చ్ 24( హింస )
ఎన్ఆర్ఐ అభ్యర్థులకూ సిట్ నోటీసులు జారీ చేసింది.
టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంతో
విదేశాల్లో ఉంటూ ఇక్కడికి వచ్చి గ్రూప్-1 పరీక్ష రాసిన వారి గురించి ఆరా తీస్తోంది. గ్రూప్-1 పరీక్షలో 100కుపైగా మార్కులు వచ్చిన 121 మందిలో పలువురిని ఇప్పటికే సిట్ విచారించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే విదేశాల్లో ఉంటూ ఇక్కడికి వచ్చి పరీక్ష రాసినవారినీ గుర్తించింది. వారు కేవలం పరీక్ష రాసేందుకు వచ్చివెళ్లినట్లు తేలింది. కీలక నిందితుడు రాజశేఖర్రెడ్డి సమీప బంధువు న్యూజిలాండ్ నుంచి వచ్చి పరీక్ష రాసినట్లు నిర్ధారణ అయింది. మరికొందరూ ఈ జాబితాలో ఉన్నట్లు తెలియడంతో వారికి నోటీసులు ఇచ్చి పిలిపించడంలో సిట్ నిమగ్నమైంది.
పుట్ట సుమన్, హిందూస్తాన్ సమాచార