ఢిల్లీ, 24 మార్చి (హిం.స): 2020 ఈశాన్య ఢిల్లీ అల్లర్ సమయంలో ఇంటిలిజెన్స్ బ్యూరో అధికారి అంకిత్ శర్మను అత్యంత దారుణంగా హత్య చేశారు. చాంద్ బాగ్ పులియా సమీపంలోని ఖజూరి ఖాస్ డ్రెయినేజ్ కాలువ నుంచి అంకిత్ శర్మ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ సమయంలో ఈ హత్య సంచలనంగా మారింది. అంకిత్ శర్మ హత్యకు సంబంధించి ఆమ్ ఆద్మీ నేత తాహిర్ హుస్సెన్, మరో 10 మందిపై ఢిల్లీ కోర్టు గురువారం కిడ్నాప్, మర్డర్ అభియోగాలను మోపింది. అధికారి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హుస్సేన్ తోపాటు 11 మంది నిందితులపై దయాల్ పూర్ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులను అదనపు సెషన్స్ జడ్డి పులస్త్య ప్రమాచల విచారించారు.
హిందుస్థాన్ సమాచార,నాగరాజ్